LIVE
కూక‌ట్‌ప‌ల్లిలో వ్య‌భిచార ముఠా గుట్టు రట్టు
వెనక్కి
Crime

కూక‌ట్‌ప‌ల్లిలో వ్య‌భిచార ముఠా గుట్టు రట్టు

43 రోజుల క్రితం
Andhra Pradesh
సారాంశం

కూక‌ట్‌ప‌ల్లిలో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ ముఠా గుట్టును రట్టు చేశారు సైబ‌రాబాద్ పోలీసులు. వ్య‌భిచార ముఠా నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రితో పాటు మ‌రో అయిదు మంది క‌స్ట‌మ‌ర్ల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ముఠాకు చెందిన మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను రెస్క్యూ చేసిన‌ట్లు చెప్పారు. శ‌నివారం పక్కా స‌మాచారం ఆధారంగా సైబరాబాద్‌ ఏహెచ్‌టీయూ బృందం దాడులు నిర్వ‌హించింది. సుమిత్రాన‌గ‌ర్‌లో ఉన్న ఇండ్ల‌పై దాడి నిర్వ‌హించారు. రాకెట్ న‌డుపుతున్న వారితో పాటు క‌స్ట‌మ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ట్లు గుర్తించారు. వారి నుంచి అధిక మొత్తంలో డ‌బ్బులు వ‌సూల్ చేస్తున్న‌ట్లు తేల్చారు. భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూల్ చేసినా.. బాధితుల‌కు మాత్రం త‌క్కువే ఇస్తున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 05:21 PMకి

సంబంధిత వార్తలు

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలులో దారుణం..హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతను చంపిన భర్త

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ బెడ్‌పై బాలింతగా ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. విచక్షణారహితంగా పొడవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

5 గంటల క్రితం
BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

BREAKING: ఆగమైన హైద్రాబాద్.. రంగంలోకి హైడ్రా

నగరంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. 4సె.మీ. వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా తెలిపింది.

6 గంటల క్రితం
డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

డబ్బున్న మైనర్లను ట్రాప్ చేస్తున్న ముఠా అరెస్ట్

ఇన్‌స్టాలో డబ్బున్న బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు అర్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలను, హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటోంది ఈ గ్యాంగ్. ఒంటరిగా ఉండే పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని...సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వారితో స్నేహం నటిస్తూ ట్రాప్ చేస్తున్నారు.

6 గంటల క్రితం
OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

OPERATION OCTOPUSE: 32 మంది బ్యాంక్ అధికారులు అరెస్ట్

HYD పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’ ద్వారా దేశవ్యాప్త సైబర్ మోసాల ముఠా గుట్టురట్టయింది. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నేరగాళ్లకు సహకరిస్తూ అక్రమ ఖాతాలు తెరిచి ఇచ్చిన బ్యాంకర్లే టార్గెట్‌గా ఈ ఆపరేషన్ సాగింది. ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు రూ.150 కోట్ల మేర వీరు దోచుకున్నారు.

6 గంటల క్రితం